జూనియర్ పంచాయితీ కార్యదర్శి పోస్టులకు 28న పరీక్ష... దరఖాస్తు గడువు పొడిగింపు

By Arun Kumar PFirst Published Sep 11, 2018, 9:01 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయితీల్లో అభివృద్ది పనులను, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో భారీగా పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.  ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రతి గ్రామానికి ఓ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని స్వయంగా ప్రస్తుత అపద్దర్మ సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే 9 వేల పైచిలుకు జూనియర్ గ్రామ పంచాయతీ ఉద్యోగాల కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 
 

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయితీల్లో అభివృద్ది పనులను, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో భారీగా పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.  ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రతి గ్రామానికి ఓ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని స్వయంగా ప్రస్తుత అపద్దర్మ సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే 9 వేల పైచిలుకు జూనియర్ గ్రామ పంచాయతీ ఉద్యోగాల కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 

అయితే ఈ ఉద్యోగాల దరఖాస్తు కోసం ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగియనుంది. ఫీజు చెల్లింపు గడువు ఈరోజుతోనే ముగుస్తోంది. ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు తదితర ప్రక్రియల్లో జాప్యం జరగడంతో చాలా మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేకపోయారు. దీంతో ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దరఖాస్తుకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపును ఈనెల 13 వ తేదీ వరకు, దరఖాస్తును ఈనెల 14వ తేదీ వరకు చేసుకోవచ్చని నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఇక ఈ నియామకాల కోసం ఈ నెల 28 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   
 

click me!