హైదరాబాద్‌లో మరో ర్యాష్ డ్రైవింగ్: దూసుకొచ్చిన కారు.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో, ఒకరి మృతి

Siva Kodati |  
Published : Jun 27, 2021, 06:59 PM IST
హైదరాబాద్‌లో మరో ర్యాష్ డ్రైవింగ్: దూసుకొచ్చిన కారు.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో, ఒకరి మృతి

సారాంశం

హైదరాబాద్‌లో ర్యాష్ డ్రైవింగ్‌లు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం శాలిబండ వద్ద జరిగిన ఘటనను మరిచిపోకముందే ఆదివారం మరో ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ వద్ద మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి తన కారుతో ఆటోను ఢీకొట్టాడు

హైదరాబాద్‌లో ర్యాష్ డ్రైవింగ్‌లు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం శాలిబండ వద్ద జరిగిన ఘటనను మరిచిపోకముందే ఆదివారం మరో ప్రమాదం జరిగింది. హైటెక్ సిటీ రహేజా మైండ్ స్పేస్ వద్ద మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి తన కారుతో ఆటోను ఢీకొట్టాడు. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో ఎగిరిపోయి ఫుట్‌పాత్‌పై పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఉమేశ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

Also Read:బిచ్చగత్తెను ఢీ కొట్టి.. పారిపోయే యత్నంలో జనంపైకి కారు: పాతబస్తీ హిట్ అండ్ రన్ కేసులో కొత్త కోణాలు

దీంతో కారును వదిలి అందులోని యువకులు పారిపోయారు. ఇదే సమయంలో కారు నడిపినవారిని కాకుండా మరొకరిని పోలీసులకు అప్పగించారు కారు యజమాని. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుడు ఉమేశ్ కుమార్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?