కత్తిని శిక్షించకుండా.. స్వామిజీని బహిష్కరిస్తారా...? అమిత్ షా ఆగ్రహం

Published : Jul 13, 2018, 04:51 PM ISTUpdated : Jul 13, 2018, 05:05 PM IST
కత్తిని శిక్షించకుండా.. స్వామిజీని బహిష్కరిస్తారా...? అమిత్ షా ఆగ్రహం

సారాంశం

తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నేతలతో కత్రియా హోటల్‌లో సమావేశమయ్యారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ను శిక్షించకుండా.. స్వామిజీని ఏ విధంగా నగర బహిష్కరణ చేస్తారని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం..

తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నేతలతో కత్రియా హోటల్‌లో సమావేశమయ్యారు.. ఈ క్రమంలో పరిపూర్ణనంద స్వామిని నగర బహిష్కరణ చేసిన అంశం చర్చకు వచ్చింది.. ఈ చర్యపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు  తెలుస్తోంది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ను శిక్షించకుండా.. స్వామిజీని ఏ విధంగా నగర బహిష్కరణ చేస్తారని ప్రశ్నించినట్టు సమాచారం..

హిందువులంతా ఏకమై స్వామిజీకి పూర్తి మద్ధతు ఇవ్వాలని షా పిలుపునిచ్చారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండగా నిలబడాలని ఆయన సూచించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు‌కు చేరుకున్న అమిత్ షాకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu