నన్ను చంపేందుకు 11 మంది దిగారు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

sivanagaprasad kodati |  
Published : Nov 10, 2018, 09:26 AM IST
నన్ను చంపేందుకు 11 మంది దిగారు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తనను అంతమొందించేందుకు భారీ కుట్ర జరుగుతుందన్నారు ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ. నిన్న రాత్రి యూకత్‌పురా బడాబజార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అహ్మదాబాద్, కర్నాటక, వారణాసి నుంచి కొంతమంది వ్యక్తులు తనను హత్య చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారని ఆరోపించారు.

తనను అంతమొందించేందుకు భారీ కుట్ర జరుగుతుందన్నారు ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ. నిన్న రాత్రి యూకత్‌పురా బడాబజార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అహ్మదాబాద్, కర్నాటక, వారణాసి నుంచి కొంతమంది వ్యక్తులు తనను హత్య చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారని ఆరోపించారు.

గతంలో తనను చంపేందుకు ఇద్దరు రెక్కీ నిర్వహించారని అక్బర్ అన్నారు. తనను చంపుతామంటూ బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని ఒవైసీ అన్నారు. ప్రజల అండదండలే తనకు రక్ష అని.. తనను చంపితే వీధికో అక్బర్ పుడతాడంటూ ఉద్వేగంగా చెప్పారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యల నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కొత్తగా హైదరాబాద్‌కు వచ్చిన వారిపై నిఘా పెడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu