నిందితుడికి కరోనా, ఆసుపత్రికి తరలింపు: హైద్రాబాద్ పోలీసుల్లో టెన్షన్

Published : Aug 07, 2020, 10:16 AM IST
నిందితుడికి కరోనా, ఆసుపత్రికి తరలింపు: హైద్రాబాద్ పోలీసుల్లో టెన్షన్

సారాంశం

ఓ కేసులో అరెస్టైన నిందితుడికి కరోనా సోకడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. ఈ ఘటన హైద్రాబాద్ పాతబస్తీలో చోటు చేసుకొంది.  

హైదరాబాద్: ఓ కేసులో అరెస్టైన నిందితుడికి కరోనా సోకడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. ఈ ఘటన హైద్రాబాద్ పాతబస్తీలో చోటు చేసుకొంది.

హైద్రాబాద్  పహాడీ షరీప్ పోలీస్ స్టేషన్  పరిధిలోని తుక్కుగూడలోని ఓ స్థలంలో దుకాణ యజమాని .. తన దుకాణంలో అద్దెకు ఉంటున్న వ్యక్తితో గొడవకు దిగాడు. దుకాణం ఖాళీ చేయడం లేదని పాతబస్తీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తిపై  షాపు యజమాని ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. గురువారం నాడు అతడిని రిమాండ్ కు తరలించే సమయంలో నిందితుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు . ఈ పరీక్షల్లో నిందితుడికి కరోనా ఉన్నట్టుగా తేలింది. ఈ విషయం తెలియడంతొ నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు విచారించిన పోలీసుల్లో కలవరం మొదలైంది. 

నిందితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరో వైపు పోలీస్ స్టేషన్ మొత్తం శానిటేషన్ చేశారు. పోలీసులు కూడ కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు సిద్దమయ్యారు.

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu