బొగ్గు ఉపరితల గనిలో గ్యాస్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు.
పెద్దపల్లి జిల్లా : ఆర్ జీ 3 పరిధిలోని ఓసీపీ1 బొగ్గు ఉపరితల గనిలో గ్యాస్ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. ఓసీపీ 1లో వెల్డర్ గా పనిచేస్తున్న కొత్తగూడెంకు చెందిన బట్టి జయంత్ కుమార్ వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ పేలి మృతి చెందాడు. మృతదేహాన్ని గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ కు తరలించారు.