రూ. 30 వేలు లంచం: ఏసీబీకి చిక్కిన జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ

Published : Jun 17, 2021, 04:28 PM IST
రూ. 30 వేలు లంచం: ఏసీబీకి చిక్కిన జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ

సారాంశం

 రూ. 30 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ.   

జగిత్యాల: రూ. 30 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు జగిత్యాల ఎస్ఐ శివకృష్ణ. ముగించిన కేసులో మళ్లీ బాధితులను పిలిచి  రూ.50 వేలు డిమాండ్ చేశారని ఎస్ఐ శివ కృష్ణపై బాధితులు ఆరోపిస్తున్నారు. 

ఈ విషయమై ఎస్ఐ వేధింపులు భరించలేక బాధితులు ఏసీబీని ఆశ్రయించాడు రాజేష్.  ఏసీబీ అధికారుల సూచన మేరకు ఎస్ఐ శివకృష్ణ గురువారం నాడు  రూ. 30 వేలు లంచం తీసుకొంటుండగా  ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ నగరంలో ఓ ఎస్ఐ ఓ భూ వివాదంలో పెద్ద ఎత్తున లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కారు.

ఈ వ్యవహరం అప్పట్లో పెద్ద ఎత్తున  సంచలనంగా మారింది.భూ వివాదంలో రెవిన్యూ అధికారులతో పాటు ఎస్ఐ కూడ అప్పట్లో ముండుపులు తీసుకొన్నారనే ఆరోపణలు కూడ వచ్చాయి. అయితే  ఆ తర్వాత ఫిర్యాదుదారుడే తప్పుడు పత్రాలతో భూ వివాదానికి తెర లేపారని తేల్చింది. పోలీసులు లంచం తీసుకొంటూ పట్టుబడడం తెలంగాణ రాష్ట్రంలో  గతంలో కూడ చోటు చేసుకొన్నాయి. 


 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu