9నెలల పసికందుపై అత్యాచారం ఆపైహత్య కేసు:మరికాసేపట్లో తీర్పు వెల్లడి

By Nagaraju penumalaFirst Published Aug 8, 2019, 1:27 PM IST
Highlights

ప్రవీణ్ కు 302 సెక్షన్ల కింద మరణ శిక్ష లేదా జీవత ఖైదు విధించే అవకాశాలు ఉన్నాయని న్యాయవాదులు చెప్తున్నారు. నిందితుడుపై ఫోక్సో యాక్ట్, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని అయితే జీవితఖైదు అనేది కచ్చితం అని అయితే మరణ శిక్ష పడాలని తాము కోరుకుంటున్నట్లు న్యాయవాదులు చెప్తున్నారు. 
 

వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారం, ఆపై హత్య కేసులో మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. తొమ్మిది నెలల చిన్నారిపై  ప్రవీణ్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. 

ఈ ఏడాది జూన్ 19న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ లోని పాలచందాలో 9 నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. హత్య చేసి పరారవుతుండగా ప్రవీణ్ ను పట్టుకుని స్థానికులు చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

అనంతరం వరంగల్ కోర్టు ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నియమించింది. విచారణ చేపట్టిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు ప్రవీణ్ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించింది. 48 రోజులపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు 35 మందిని విచారించింది. విచారణ అనంతరం ప్రవీణ్ నిందితుడిగా తేల్చింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో వరంగల్ కోర్టు నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. 

ప్రవీణ్ కు 302 సెక్షన్ల కింద మరణ శిక్ష లేదా జీవత ఖైదు విధించే అవకాశాలు ఉన్నాయని న్యాయవాదులు చెప్తున్నారు. నిందితుడుపై ఫోక్సో యాక్ట్, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని అయితే జీవితఖైదు అనేది కచ్చితం అని అయితే మరణ శిక్ష పడాలని తాము కోరుకుంటున్నట్లు న్యాయవాదులు చెప్తున్నారు. 

ఇకపోతే చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అయిన ప్రవీణ్ జూన్ 19న డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కు మరణశిక్షకు విధించాలని తెలుగు రాష్ట్రాల ప్రకజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

9 నెలల చిన్నారిపై రేప్, హత్య: ప్రవీణ్ ఫోన్లో నీలి చిత్రాలు?

click me!