ఆబిడ్స్ లో విషాదం; చిన్నారి పాపను చిదిమేసిన వాటర్ ట్యాంకర్

Siva Kodati |  
Published : Mar 01, 2019, 11:46 AM IST
ఆబిడ్స్ లో విషాదం; చిన్నారి పాపను చిదిమేసిన వాటర్ ట్యాంకర్

సారాంశం

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ చిన్నారి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే..  ఎనిమిదేళ్ల దియా జైన్.... అబిడ్స్‌లోని రోజరి స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. 

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ చిన్నారి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే..  ఎనిమిదేళ్ల దియా జైన్.... అబిడ్స్‌లోని రోజరి స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లేందుకు తండ్రి నరేశ్ జైన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.

రోడ్డుపై వెళుతుండగా వెనుక నుంచి దూసుకువచ్చిన వాటర్ ట్యాంకర్ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దియా మీదుగా ట్యాంకర్ దూసుకెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే మరణించింది. తీవ్రగాయాల పాలైన నరేశ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Tirumala : రూ.300 దర్శన టికెట్స్ దొరకలేవా? నెలరోజుల్లోపే ఇదే క్యూలైన్ లో వెళ్లి శ్రీవారిని దర్శించుకునే సూపర్ ట్రిక్