మహబూబాబాద్ :లారీపై నుంచి జారి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి, 8 మంది కూలీల దుర్మరణం..?

Siva Kodati |  
Published : Dec 31, 2022, 08:24 PM ISTUpdated : Dec 31, 2022, 09:24 PM IST
మహబూబాబాద్ :లారీపై నుంచి జారి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి, 8 మంది కూలీల దుర్మరణం..?

సారాంశం

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో గ్రానైట్ లారీ నుంచి బండరాయి జారి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు.  

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీ నుంచి బండరాయి జారి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కూలీ పనులకు వెళ్లి వస్తుండగా కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులందరినీ చిన్నగూడెం మండలం మంగోరిగూడెనికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీస్ , అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu