అత్యాచారం కేసులో 58 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష...

Published : Jul 15, 2023, 11:57 AM IST
 అత్యాచారం కేసులో 58 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష...

సారాంశం

టీనేజర్ పై అత్యాచారం కేసులో ఓ 58యేళ్ల వ్యక్తికి హైదరాబాద్ లోని సెషన్స్ కోర్టు 20 యేళ్ల జైలుశిక్ష విధించింది. 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో ఓ అత్యాచార నిందితుడికి 20యేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. నగరంలోని భవానీనగర్‌లో తన బంధువుపై 58 ఏళ్ల వ్యక్తిపలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తికి పోక్సో కేసుల 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కమ్ స్పెషల్ కోర్టు జడ్జి టి.అనిత శుక్రవారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

దీనితో పాటు 5,000 జరిమానా చెల్లించాలని, బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆర్థికంగా చితికిపోయిన బాధితురాలి తల్లిదండ్రులు దోషి పనిచేసిన పాఠశాలలో ఆ అమ్మాయిని చేర్పించారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

జగన్ అక్రమాస్తుల కేసు : వైఎస్ భారతీరెడ్డిపై ఈడీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం..

బాధితురాలు కొద్దికాలం దాడిని భరించింది. అదింకా ఆగేలాగా లేకపోవడంతో.. ఆమె ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇది సహాయపడిందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ప్రతాప్ రెడ్డి తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House