సిద్ధిపేటలో 40 ఊర కుక్కలను చంపి పాతేశారు: కలెక్టర్ సీరియస్

By telugu teamFirst Published Jun 23, 2019, 7:12 PM IST
Highlights

సిద్ధిపేటలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది 40 ఊర కుక్కలను చంపేసి, పాతిపెట్టారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషరన్ జోయెల్ డేవిస్ ధ్రువీకరించారు. 

సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేటలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది 40 ఊర కుక్కలను చంపేసి, పాతిపెట్టారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషరన్ జోయెల్ డేవిస్ ధ్రువీకరించారు. 

సంఘటనకు బాధ్యులైనవారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. శునకాల శవాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్ాపరు. 

ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి తీవ్రంగా స్పందించారు. సంఘటనకు బాధ్యులైన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

 

Siddipet District Collector Venkatrama Reddy, has issued an order of suspension for four Siddipet Municipal staffers in connection with the incident. https://t.co/jnV3nBQMis

— ANI (@ANI)
click me!