మనోహరాబాద్‌లో చెరువులో నలుగురు గల్లంతు.. ముగ్గురి మృతదేహాల వెలికితీత, బాలుడి కోసం గాలింపు..

Published : Sep 25, 2023, 03:21 PM IST
మనోహరాబాద్‌లో చెరువులో నలుగురు గల్లంతు.. ముగ్గురి మృతదేహాల వెలికితీత, బాలుడి కోసం గాలింపు..

సారాంశం

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం చోటుచేసుకుంది. 

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో నలుగురు గల్లంతయ్యారు. చెరువులో స్నానానికి వెళ్లిన బాలుడు గల్లంతు  కాగా.. అతడిని కాపాడేందుకు ఒక మహిళ యత్నించింది. ఈ క్రమంలోనే మహిళ గల్లంతైంది. మరో ఇద్దరు మహిళలు కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నించి గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళలు మృతిచెందారు. ముగ్గురు మహిళల మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. చెరువులో గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది.  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?