రంగారెడ్డి జిల్లా యాచారంలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

By Sumanth KanukulaFirst Published Oct 2, 2022, 3:17 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతిచెందారు. 

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. చిన్నారులంతా 15 ఏళ్లలోపేవారని తెలుస్తోంది. మృతులను సుమరీన్, ఖలీద్, ఇమ్రాన్, రెహానగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

దసరా సెలవులు కావడంతో పిల్లలు సరదగా ఈతకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో వారి కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా  విలపిస్తున్నారు. 

click me!