ప్రారంభమైన తుది విడత పంచాయతీ పోలింగ్

sivanagaprasad kodati |  
Published : Jan 30, 2019, 07:30 AM IST
ప్రారంభమైన తుది విడత పంచాయతీ పోలింగ్

సారాంశం

తెలంగాణ వ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3,529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం 32,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 3,529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకోసం 32,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,667 మంది సర్పంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు.

27,583 వార్డుల్లో 67,316 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పోలింగ్ దృష్ట్యా పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. 

PREV
click me!

Recommended Stories

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పలితాలు.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..?
Viral News: అస‌లేంటీ కోవా బ‌న్ వివాదం.? ఎందుకు ఇంత‌లా వైర‌ల్ అవుతోంది