24 గంటల్లో 329 మందికి పాజిటివ్, జీహెచ్‌ఎంసీలో తీవ్రత.. తెలంగాణలో 6,60,471కి చేరిన కేసులు

By Siva KodatiFirst Published Sep 8, 2021, 10:06 PM IST
Highlights

తెలంగాణలో కొత్తగా 329 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 307 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,497 యాక్టివ్‌ కేసులు వున్నాయి.
 

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 329 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,60,471కి చేరుకుంది. కోవిడ్ వల్ల ఒకరు చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 307 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,51,085కి చేరింది. తాజా మరణంతో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో 3,889 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,497 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,421 మంది శాంపిల్స్ ని పరీక్షించారు

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 81, జగిత్యాల 6, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 27, ఖమ్మం 19, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 3, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 23, ములుగు 1, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 20, నారాయణపేట 1, నిర్మల్ 2, నిజామాబాద్ 2 , పెద్దపల్లి 16, సిరిసిల్ల 7, రంగారెడ్డి 13, సిద్దిపేట 7, సంగారెడ్డి 3, సూర్యాపేట 9, వికారాబాద్ 4, వనపర్తి 3, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 23, యాదాద్రి భువనగిరిలో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.08.09.2021 at 5.30pm) pic.twitter.com/5cUYxYD2YF

— IPRDepartment (@IPRTelangana)
click me!