శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 30 విమానాలు రద్దు..!

By telugu news teamFirst Published May 8, 2021, 8:25 AM IST
Highlights

హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-పూణె, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దాదాపు 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 30 విమానాలను అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-పూణె, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దాదాపు 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరగడంతోనే విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా... భారత్ లో కరోనా తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది. వరుసగా రెండోరోజు భారత్ లో  కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 4,14,030 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 3,919 మంది మరణించారు. దేశంలో తాజాగా నమోదైన కరోనా కేసులతో 21,485,285కి చేరుకొన్నాయి. దేశంలో ఇంకా 3.65 మిలియన్ యాక్టివ్ కేసులున్నాయి.

దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. మహారాష్ట్రలో కరోనా విజృంభజణ కొనసాగుతోంది. రాష్ట్రంలో 62,194 కేసులు నమోదు కాగా, 853 మంది మరణించారు. కర్ణాటకలో 49,058 కేసులు రికార్డయ్యాయి.

కరోనాతో 328 మంది మరణించారు. బెంగుళూరులోనే 23,106 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 161 మంది చనిపోయారు. కేరళలో 42,464 కేసులు నమోదయ్యాయి. 63 మంది కరోనాతో మృతి చెందారు. యూపీలో 26,780 కేసులు రికార్డుకాగా, కరోనాతో 353 మంది చనిపోయారు. తమిళనాడులో 24,898 కేసులు రికార్డు కాగా, డిల్లీలో 20 వేల కేసులు నమోదయ్యాయి.

click me!