చిన్నారి మృతి కలకలం.. పోలియో చుక్కల వల్లేనంటూ పేరేంట్స్ ఆందోళన

Siva Kodati |  
Published : Jan 31, 2021, 07:42 PM IST
చిన్నారి మృతి కలకలం.. పోలియో చుక్కల వల్లేనంటూ పేరేంట్స్ ఆందోళన

సారాంశం

రంగారెడ్డి జిల్లా దుండిగల్ శంభిపూర్‌లో మూడు నెలల చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆదివారం పోలియో చుక్కలు వేయించిన తర్వాత పాప అస్వస్థతకు గురైందని తల్లిదండ్రులు చెబుతున్నారు

రంగారెడ్డి జిల్లా దుండిగల్ శంభిపూర్‌లో మూడు నెలల చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆదివారం పోలియో చుక్కలు వేయించిన తర్వాత పాప అస్వస్థతకు గురైందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం పోలియో చుక్కలు వేయించారు. ఆ వెంటనే పాప అస్వస్థతకు గురికావడంతో చిన్నారిని మియాపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మరణించింది.

పోలియో చుక్కలు వేయించిన తర్వాతే పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యాధికారులు చిన్నారి మరణానికి దారి తీసిన పరిస్ధితులపై ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్