ఎమర్జెన్సీ లైట్‌లో మూడు కిలోల బంగారం: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కడప వాసి అరెస్ట్

Published : May 24, 2023, 10:52 AM IST
ఎమర్జెన్సీ లైట్‌లో  మూడు కిలోల బంగారం: శంషాబాద్  ఎయిర్ పోర్టులో  కడప  వాసి అరెస్ట్

సారాంశం

శంషాబాద్  ఎయిర్ పోర్టులో  దుబాయి నుండి వచ్చిన ప్రయాణీకుడి  నుండి  మూడు  కిలోల బంగారాన్ని   కస్టమ్స్ అధికారులు  సీజ్  చేశారు. 

హైదరాబాద్:  నగరంలోని  శంషాబాద్  ఎయిర్ పోర్టులో   దుబాయి  నుండి వచ్చిన  ప్రయాణీకుడి  నుండి  బుధవారంనాడు  మూడు కిలోల బంగారాన్ని  కస్టమ్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ  రూ. 1.80 కోట్లుగా ఉంటుందని  అధికారులు  చెబుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కడపకు చెందిన  ప్రయాణీకుడు  దుబాయి నుండి  హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు  చేరుకున్నాడు. ఈ ప్రయాణీకుడి వద్ద  ఉన్న ఎమర్జెన్సీ  లైట్ లో బంగారాన్ని  గుర్తించారు  అధికారులు.  దుబాయి నుండి వచ్చిన  ప్రయాణీకుడిని  కస్టమ్స్ అధికారులు  తనిఖీ చేసిన సమయంలో  ఈ విషయం వెలుగు చూసింది.  ఈ ప్రయాణీకుడిని  కస్టమ్స్  అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

మూడు  కిలోల బంగారాన్ని  ఈ ప్రయాణీకుడు   ఎక్కడికి  తరలిస్తున్నారనే విషయమై   కస్టమ్స్   అధికారులు  ఆరా తీస్తున్నారు.  గతంలో  కూడ  శంషాబాద్  ఎయిర్ పోర్టులో   బంగారం తరలిస్తూ  పలువురు  పట్టుబడిన ఘటనలు   చోటు  చేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి  14న  శంషాబాద్  ఎయిర్ పోర్టులో  14 కిలోల బంగారాన్ని అధికారులు  సీజ్  చేశారు. సూడాన్ నుండి వచ్చిన 23 మంది  ప్రయాణీకుల నుండి  14 కిలోల బంగారాన్ని సీజ్  చేశారు. 

శంషాబాద్  ఎయిర్ పోర్టులో అక్రమంగా బంగారం  తరలిస్తున్న వ్యక్తిని  అధికారులు  ఈ  ఏడాది ఫిబ్రవరి  25న అరెస్ట్  చేశారు. రూ. 47 లక్షల విలువైన  బంగారాన్ని కస్టమ్స్  అధికారులు  సీజ్  చేశారు.

2022 నవంబర్  12న  ఐదున్న కిలోల బంగారాన్ని  శంషాబాద్ ఎయిర్ పోర్టులో  ప్రయాణీకుల  నుండి  కస్టమ్స్ అధికారుల  సీజ్  చేశారు.   అమిర్ ఖాన్,  మహ్మద్  ఖురేషి  నుండి  అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు.  పేస్ట్  రూపంలోకి బంగారాన్ని మార్చి  తరలిస్తున్న సమయంలో   అధికారులు  సీజ్  చేశారు. 

also read:హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారం సీజ్: నలుగురు అరెస్ట్

2022  అక్టోబర్  06వ తేదీన   శంషాబాద్  ఎయిర్ పోర్టులో ఏడు కిలోల బంగారాన్ని  అధికారులు సీజ్  చేశారు.  దీని విలువ  సుమారు  రూ.3.5 కోట్లుగా  అధికారులు  గుర్తించారు.  2022  ఆగష్టు  14వ తేదీన  హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  రూ. 13.63 లక్షల  విలువైన  బంగారాన్ని సీజ్  చేశారు.  లోదుస్తుల్లో   ప్రయాణీకులు  బంగారాన్ని తరలించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu