2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్.. ఒక్క ప్యాకెట్ ఎంతంటే...

Published : May 28, 2021, 02:35 PM IST
2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్.. ఒక్క ప్యాకెట్ ఎంతంటే...

సారాంశం

డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. కరోనా చికిత్సలో 2-డీజీ సాచెట్ అద్భుతంగా పని చేస్తుందని డీఆర్డీవో తెలిపింది. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ. 990గా రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్ లు అవసరం, చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చవుతుంది. 

డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. కరోనా చికిత్సలో 2-డీజీ సాచెట్ అద్భుతంగా పని చేస్తుందని డీఆర్డీవో తెలిపింది. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ. 990గా రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్ లు అవసరం, చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చవుతుంది. 

కరోనా బారినపడ్డవారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌)  ఔషధాన్ని డాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విదితమే. ముందుగా 10వేల సాచెట్ లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 

2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే. 2-డీజీ మందు పొడి రూపంలో లభిస్తుంది. దీన్ని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం శరీరంలోని వైరస్ సోకిన కణాలకు చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్ లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్ తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2-డీజీ ప్రత్యేకత. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్