ప్రాణం తీసిన వేగం: కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టిన బైక్.. ఎగిరిపడిన యువకుల మృతదేహాలు

Siva Kodati |  
Published : Aug 27, 2020, 07:16 PM IST
ప్రాణం తీసిన వేగం: కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టిన బైక్.. ఎగిరిపడిన యువకుల మృతదేహాలు

సారాంశం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ సర్కిల్ సమీపంలోని మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. దుర్గానగర్ చౌరస్తాలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డు మధ్యలో వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ సర్కిల్ సమీపంలోని మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. దుర్గానగర్ చౌరస్తాలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డు మధ్యలో వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు.

ప్రమాదంలో ఇద్దరు యువకులు  అక్కడికక్కడే మరణించారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్తంభాన్ని ఢీకొట్టిన అనంతరం వీరిద్దరి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. మృతులను ఆరాంఘర్‌కు చెందిన ఎండీ సజ్జాద్, మహ్మద్ నిజాముద్దీన్‌గా గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi : తెలంగాణకు మోదీ వరాలు.. గోల్డ్ కొనొద్దని ప్రధాని ఎందుకు అన్నారు?
PM Modi: పెళ్లి కోసం ప్లాన్ మార్చుకున్న మోదీ.. 18 కిలోమీటర్లు రోడ్డుపైనే ప్రయాణం.. వైరలవుతున్న ప్రధాని నిర్ణయం!