
తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 38,615 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 78 కొత్త కేసులు (corona cases) నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20, రంగారెడ్డి జిల్లాలో 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9, కరీంనగర్ జిల్లాలో 8 కేసులు గుర్తించారు. ఆదిలాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 184 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకోగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,75,994 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,411 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 3,591 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన (corona deaths in telangana) వారి సంఖ్య సంఖ్య 3,992కి పెరిగింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 9, జీహెచ్ఎంసీ 78, జగిత్యాల 3, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 8, ఖమ్మం 6, మహబూబ్నగర్ 3, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 3, మంచిర్యాల 2, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 20, ములుగు 1, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 5, నారాయణపేట 3, నిర్మల్ 3, నిజామాబాద్ 2, పెద్దపల్లి 4, సిరిసిల్ల 2, రంగారెడ్డి 15, సిద్దిపేట 2, సంగారెడ్డి 5, సూర్యాపేట 4, వికారాబాద్ 1, వనపర్తి 0, వరంగల్ రూరల్ 0, వరంగల్ అర్బన్ 8, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.