
తెలంగాణలో (Telangana) గడచిన 24 గంటల్లో 37,857 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 176 మందికి (corona cases) పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 53 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
216 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి (corona deaths in telangana) చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటిదాకా తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,67,334కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ల సంఖ్య 6,59,043కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 4,365 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 3,926కి పెరిగింది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 53, జగిత్యాల 6, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 2, కరీంనగర్ 14, ఖమ్మం 6, మహబూబ్నగర్ 1, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 1, మంచిర్యాల 3, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 7, ములుగు 1, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 9, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 4 , పెద్దపల్లి 6, సిరిసిల్ల 7, రంగారెడ్డి 14, సిద్దిపేట 4, సంగారెడ్డి 3, సూర్యాపేట 6, వికారాబాద్ 1, వనపర్తి 1, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 11, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.