తెలంగాణలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. 24 గంటల్లో కేవలం 162 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Oct 03, 2021, 09:59 PM IST
తెలంగాణలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. 24 గంటల్లో కేవలం 162 మందికి పాజిటివ్

సారాంశం

తెలంగాణలో కొత్తగా 162 కరోనా కేసులు నమోదవ్వగా.. వైరస్ వల్ల ఒకరు మరణించారు. 247 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,455 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,828 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 162 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,66,546కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. ఒకరోజు వ్యవధిలో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,921కి చేరింది. కోవిడ్ బారి నుంచి నిన్న 247 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,455 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 63, జగిత్యాల 1, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 13, ఖమ్మం 5, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 0, మంచిర్యాల 9, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 7, ములుగు 0, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 10, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 2 , పెద్దపల్లి 3, సిరిసిల్ల 2, రంగారెడ్డి 11, సిద్దిపేట 5, సంగారెడ్డి 3, సూర్యాపేట 3, వికారాబాద్ 1, వనపర్తి 3, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 9, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో పెరుగుతోన్న కులాంతర వివాహాలు.. ఏ కులంలో ఎక్కువగా జరుగుతున్నాయంటే.
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu