
తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 26,676 మందికి కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి (corona cases) పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాల్లో ఎక్కడా రెండంకెల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కకొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 176 మంది కరోనా నుంచి కోలుకోగా, (corona deaths in telangana) ఒకరు మరణించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,68,955కి చేరింది. తాజా డిశ్చార్జ్లతో 6,61,093 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,924 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్తో మరణించిన వారి సంఖ్య 3,938కి చేరుకుంది.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 55, జగిత్యాల 3, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 9, ఖమ్మం 7, మహబూబ్నగర్ 5, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 0, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 4, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 3, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 1, పెద్దపల్లి 1, సిరిసిల్ల 1, రంగారెడ్డి 9, సిద్దిపేట 1, సంగారెడ్డి 2, సూర్యాపేట 2, వికారాబాద్ 1, వనపర్తి 0, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 3, యాదాద్రి భువనగిరిలో 0 చొప్పున కేసులు నమోదయ్యాయి.