బేగం బజార్ లో కరోనా కలకలం: 100 మందికి కోవిడ్, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు

Published : Apr 08, 2021, 10:35 AM IST
బేగం బజార్ లో కరోనా కలకలం: 100 మందికి కోవిడ్,  సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు

సారాంశం

నగరంలోని బేగంబజార్ లో సుమారు 100 మందికి కరోనా సోకింది. దీంతో స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు.

హైదరాబాద్: నగరంలోని బేగంబజార్ లో సుమారు 100 మందికి కరోనా సోకింది. దీంతో స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు.ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే  దుకాణాలను ఓపెన్ చేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని వైరస్ వ్యాప్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.ప్రజలు  కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో  కరోనా కేసులు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా సెకండ్ వేవ్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరో నాలుగు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని  వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు.గత ఏడాది కూడ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో బేగం బజారులో దుకాణాలను మూసివేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్