రిలయన్స్ కష్టమర్లకు జియో మరో బంపర్ ఆఫర్

First Published Jul 30, 2018, 12:36 PM IST
Highlights

తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు కొత్తగా యాడ్‌-ఆన్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. దీని కింద ప్రస్తుతమున్న ప్యాక్‌లపైనే అదనంగా రోజుకు 2 జీబీ డేటాను ఆఫర్‌ చేయడం మొదలు పెట్టింది.
 

ప్రముఖ టెలికాం సంస్థ జియో.. మరోసారి కష్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇప్పటికే అతి తక్కువ ధరకే మొబైల్ డేటా, ఇతర ఆఫర్లను అందిస్తున్న జియో.. తాజాగా మరోసారి తన కస్టమర్లకు భలే ఆఫర్‌ తీసుకొచ్చింది. తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు కొత్తగా యాడ్‌-ఆన్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. దీని కింద ప్రస్తుతమున్న ప్యాక్‌లపైనే అదనంగా రోజుకు 2 జీబీ డేటాను ఆఫర్‌ చేయడం మొదలు పెట్టింది.

 అయితే ఇది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమేనట. ఈ అదనపు డేటా పొందడానికి అర్హత ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. మైజియో యాప్‌లో ద్వారా ఆటోమేటిక్‌గా యాడ్‌-ఆన్‌ ప్యాక్‌ను కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిసింది. ఈ యాడ్‌-ఆన్‌ ప్యాక్‌ 2018 జూలై 31 వరకే వాలిడ్‌లో ఉండనుందని తెలిసింది. 

జియో ప్యాక్‌ యాక్టివ్‌తో... ఒకవేళ జియో యూజర్‌ రూ.399 ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై రోజుకు 1.5 జీబీ డేటాను పొందుతూ ఉంటే, ఇక నుంచి రోజుకు 2 జీబీ అదనపు డేటాతో, మొత్తం 3.5 జీబీ 4జీ డేటాను పొందనున్నారు. ఈ ప్యాక్‌ వాలిడిటీ జూలై 31 వరకు ఉంటుందని తెలిసినప్పటికీ, కొంతమంది యూజర్లకు ఆగస్టు 2 వరకు ఆఫర్‌ చేస్తుందని టెలికాం టాక్‌ రిపోర్టు చేసింది. 
 

click me!