వచ్చేనెలలో... రియల్ మీ ఎక్స్ 2 ప్రో

By Ashok KumarFirst Published Oct 25, 2019, 1:42 PM IST
Highlights

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ వచ్చేనెలలో ఎక్స్2 ప్రో, ఎక్స్ టీ 730జీ ఫోన్లను విపణిలోకి ప్రవేశపెట్టనున్నది. వచ్చేనెలలో ఎక్స్2 ప్రో ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లోకి విడుదల చేయనున్నది.

న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ త్వరలో అద్భుతమైన ఫీచర్లతో మరో రెండు రకాల ఫోన్లను అందుబాటులోకి తేనున్నది. నవంబర్​ నెలలో రియల్​ మీ నుంచి ఎక్స్​2 ప్రోను, డిసెంబర్​లో ఎక్స్​టీ 730జీ మోడల్ ఫోన్​ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. 

ఈ రెండింటిలో ఎక్స్​2 ప్రో ఫోన్‌ను ప్రీమియం సిగ్మెంట్​లో వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. అయితే వీటితో పాటు రియల్ మీ 5ఎస్​ పేరుతో ఓ బడ్జెట్​ ఫోన్​ను ఆవిష్కరించాలని తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

also read యమహా నుంచి రెండు కొత్త సౌండ్ బార్స్

ఒప్పో అనుబంధ సంస్థగా రియల్ మీ మార్కెట్లోకి ప్రవేశించినా.. భారత్​లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. వెనువెంటనే కొత్త మోడళ్లను విడుదల చేస్తూ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. 

రియల్​మీ ఎక్స్​2 ప్రో ప్రీమియం మోడల్​ను నవంబర్​లో విడుదల చేయనున్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎక్స్​2 ప్రోతో పాటు రియల్​మీ​ 5ఎస్​ మోడల్​ను​ భారత మార్కెట్లోకి విడుదల చేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రియల్​ మీ 5ఎస్​ను.. వివో యూ10 రీబ్రాండ్​గా విడుదల చేసే అవకాశం ఉన్నదని టెక్ వర్గాల సమాచారం. వివో యూ10 స్మార్ట్ ఫోన్ రియల్​ మీ 5 సిరీస్ ఫోన్ల తర్వాత విడుదలైంది. వివో యూ10 ప్రస్తుతం అమెజాన్​లో ఎక్స్​క్లూజివ్​గా రూ.8,990 ధరలో అందుబాటులో ఉంది.

also read నేడే మోటో జి8 ప్లస్ విడుదల ....అదిరిపోయే ఫీచర్స్ 

6.35 హెచ్​డీ ప్లస్ డిస్​ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీల స్టోరేజీ, వెనుకవైపు మూడు కెమెరాలు, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రియల్ మీ 5ఎస్​ వివో యూ10ను పోలి ఉన్నా, 4 కెమెరాలతో మార్కెట్లోకి రావచ్చని సమాచారం. 

ఇక ప్రీమియం సెగ్మెంట్​లో 'రియల్​ మీ ఎక్స్​2 ప్రో' నవంబర్ 20న విడుదల కానున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే పేర్కొంది. వీటి అమ్మకాలు మాత్రం డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది.
 

click me!