రిలయన్స్ జియో : ట్రు 5జి సర్వీస్ అందిస్తున్న ఏకైక నెట్ వర్క్... వెల్‌కమ్ ఆఫర్‌ కూడా..

By asianet news teluguFirst Published Nov 19, 2022, 12:28 PM IST
Highlights

కంపెనీ ప్రకటన ప్రకారం, నెట్‌వర్క్ సిగ్నల్స్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అన్ని కీలక ప్రాంతాలలో  ఉంటాయి. Jio True 5G నెట్‌వర్క్  నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, మాల్స్, ప్రధాన మార్కెట్లు, టెక్ పార్కులు అండ్ మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటుంది. 

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో  ట్రూ 5జి సర్వీస్ ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా ప్రారంభించింది. కంపెనీ ప్రకారం ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ అండ్ ఢిల్లీ-NCR ప్రాంతంలో ట్రూ-5G సర్వీస్ అందించే ఏకైక ఆపరేటర్‌గా రిలయన్స్ జియో అవతరించింది. జియో  True-5G నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తుంది. రిలయన్స్ జియో ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, నాథ్‌ద్వారాలో  సర్వీస్ ప్రారంభించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ఈ లిస్ట్ లో  కొత్తగా వచ్చి చేరింది. 

కంపెనీ ప్రకటన ప్రకారం, నెట్‌వర్క్ సిగ్నల్స్ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అన్ని కీలక ప్రాంతాలలో  ఉంటాయి. Jio True 5G నెట్‌వర్క్  నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, మాల్స్, ప్రధాన మార్కెట్లు, టెక్ పార్కులు అండ్ మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటుంది. 

ఢిల్లీలో లక్షలాది మంది జియో యూజర్లు ఇప్పటికే జియో ట్రూ 5జి సర్వీస్ ఉపయోగిస్తున్నారు. NCR ప్రాంతంలో 5G సర్వీస్ ప్రారంభించిన తర్వాత, Jio యూజర్లకు Jio వెల్‌కమ్ ఆఫర్ ఇన్విటేషన్ లభిస్తుంది. ఈ ఆఫర్ కింద కస్టమర్‌లు ఆన్ లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు ఇంకా 1 Gbps వరకు స్పీడ్ లభిస్తుంది, ఇందుకు ఎటువంటి ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదు.

రిలయన్స్ జియో ప్రతినిధి మాట్లాడుతూ, “దేశ రాజధాని అండ్ NCR ప్రాంతంలోని చాలా ప్రాంతాలను కవర్ చేయడం మాకు గర్వకారణం. Jio ట్రూ 5G సర్వీస్ వేగంగా విస్తరింపజేస్తోంది, ఇప్పటికే చాలా ప్రాంతంలో దీనిని విడుదల చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 5జీ సేవలను అందించే ఏకైక ఆపరేటర్ రిలయన్స్ జియో. ఈ టెక్నాలజి ప్రజల జీవితాలను మార్చగలదు కాబట్టి ప్రతి భారతీయుడికి ట్రు 5G సర్వీస్ అందుబాటులో ఉండేలా జియో ఇంజనీర్లు 24 గంటలూ పనిచేస్తున్నారు.

click me!