ఆపిల్ ఫ్యాక్టరీ నుండి గోడ ఎక్కి పారిపోతున్న ఉద్యోగులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కారణం ఏంటంటే..?

By asianet news teluguFirst Published Nov 1, 2022, 1:16 PM IST
Highlights

ఈ వీడియో మొత్తం ఆపిల్ ఫ్యాక్టరీ ఉన్న సెంట్రల్ చైనీస్ నగరం   జెంగ్‌జౌ(Zhengzhou)గా చెప్పబడింది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు చిక్కుకుపోకూడదని, ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకూడదనే భయం నెలకొంది. దీంతో వారు ఆ భయంతో గోడ ఎక్కి పరుగులు తీస్తున్నారు. 

చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి, చాలా నగరాల్లో లాక్‌డౌన్ కూడా విధించబడింది. ఈ లాక్‌డౌన్ మధ్య ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో కొందరు గోడ ఎక్కి పరిగెత్తడం చూడవచ్చు. అయితే గోడ ఎక్కి పారిపోతున్న వారు యాపిల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని, లాక్‌డౌన్‌ కారణంగా పారిపోతున్నారని వాపోతున్నారు.

ఈ వీడియో మొత్తం ఆపిల్ ఫ్యాక్టరీ ఉన్న సెంట్రల్ చైనీస్ నగరం   జెంగ్‌జౌ(Zhengzhou)గా చెప్పబడింది. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు చిక్కుకుపోకూడదని, ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకూడదనే భయం నెలకొంది. దీంతో వారు ఆ భయంతో గోడ ఎక్కి పరుగులు తీస్తున్నారు. అయితే దీని వల్ల యాపిల్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణా అందుబాటులో లేదు.

చైనీస్ మీడియా ప్రకారం, జెంగ్‌జౌలోని ఈ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్ ఫ్యాక్టరీ, ఇందులో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచంలోని సగం ఐఫోన్‌లను ఇక్కడ తయారు చేస్తున్నారు. కొంతకాలంగా ఫ్యాక్టరీ లోపల పరిస్థితులు సరిగ్గా లేదని, దీని కారణంగా ప్రజలు కూడా పారిపోవాల్సి వస్తోందని కొన్ని నివేదికలలో పేర్కొన్నారు.

కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున చాలా మంది కార్మికులను క్వారంటైన్‌లో ఉంచినట్లు గతంలో నివేదించబడింది. శనివారం నుండి చైనీస్ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఫోటోలు, వీడియోలలో ఫాక్స్‌కాన్ ఉద్యోగులు ఇంటికి తిరిగి వస్తున్నట్లు, ఉదయం పొలాల మీదుగా, రాత్రి రోడ్ల వెంట ట్రెక్కింగ్ చేస్తున్నట్లుగా కనిపించాయి.

హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగ్‌జౌలో  అక్టోబర్ 29 వరకు ఏడు రోజులలో స్థానికంగా 167 కోవిడ్ కేసులను నివేదించింది. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి చైనా కఠినమైన లాక్‌డౌన్ చర్యలను కొనసాగిస్తున్నందున దాదాపు 10 మిలియన్ల జనాభా ఉన్న నగరం పాక్షికంగా లాక్ చేయబడింది.

click me!