తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 173 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే 173 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ.. శనివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు.
మేనిఫెస్టోలోని అంశాలు:
విద్య, ఉపాధి, ఆర్ధికాభివృద్ధికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత
అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టులు
పెంచిన ఆస్తి పన్ను రద్దు
హిందూ ఆలయాల పునరుద్దరణకు వెయ్యి కోట్లు
అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
వంట గ్యాస్ సిలిండర్పై రూ.100 సబ్సిడీ
మసీదు, చర్చిల పునరుద్దరణకు రూ.200 కోట్లు
ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు అవకాశం
జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమీషన్
ఆవిన్ పాల ధర లీటర్పై రూ.3 తగ్గింపు
మహిళలకు ప్రసూతి సెలవులు 12 నెలలకు పెంపు
నీట్ పరీక్ష రద్దుకు శాసనసభ తొలి సమావేశంలో ఆర్డినెన్స్