తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పొత్తులు, మేనిఫెస్టో తంతును ముగించిన ప్రధాన పార్టీలు.. ప్రచారంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీజేపీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పొత్తులు, మేనిఫెస్టో తంతును ముగించిన ప్రధాన పార్టీలు.. ప్రచారంపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీజేపీ.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించనున్నారు.
ఇక వీరితో పాటు స్థానిక అలనాటి నటి గౌతమి కూడా స్టార్ క్యాంపెయినర్గా అధిష్టానం ప్రకటించింది. మరోవైపు అన్నాడీఎంకే - బీజేపీ కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా కమలనాథులకి 20 సీట్లు దక్కాయి.
తొలుత రాజపాళయం నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేయాలని గౌతమి భావించారు. అయితే పొత్తుల్లో భాగంతా ఈ సీటు కమలనాథుల చేజారడంతో, గౌతమికి నిరాశే ఎదురైంది. అయితే స్టార్ క్యాంపెయినర్గా ఆమె సేవలు వినియోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించడం గమనార్హం. కాగా ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.
బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే
1. నరేంద్ర మోడీ
2. జేపీ నడ్డా
3. రాజ్నాథ్ సింగ్
4. అమిత్ షా
5. నితిన్ గడ్కరీ
6.నిర్మలా సీతారామన్
7. స్మృతి ఇరానీ
8. ఎస్ జైశంకర్
9. కిషన్రెడ్డి
10. జనరల్ వీకే సింగ్(రిటైర్డు)
11. యోగి ఆదిత్యనాథ్
12. శివరాజ్ సింగ్ చౌహాన్
13. సీటీ రవి
14. పురందేశ్వరి
15. పి సుధాకర్ రెడ్డి
16. తేజస్వి సూర్య
17. ఎల్ గణేషన్
18. వీపీ దురైస్వామి
19.కేటీ రాఘవన్
20. శశికళ పుష్ప
21. గౌతమి తాడిమల్ల
22. రాధారవి
23. కేపీ రామలింగం
24. గాయత్రీ దేవి
25. రాజ్కుమార్ గణేషన్
26. విజయశాంతి
27. సెంథిల్
28. వెల్లూర్ ఇబ్రహీం
29. ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్
30. ప్రొఫెసర్ కనగ సబాపతి