కివీస్‌కు చుక్కలు చూపిన సృతీ..సెంచరీ మిస్

Siva Kodati |  
Published : Feb 10, 2019, 11:52 AM IST
కివీస్‌కు చుక్కలు చూపిన సృతీ..సెంచరీ మిస్

సారాంశం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న చివరి టీ20లో భారత స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు స్మృతీ ధాటిగా ఆడింది.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న చివరి టీ20లో భారత స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు స్మృతీ ధాటిగా ఆడింది.

ఓ వైపు వికెట్లు పడుతున్నా వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరికి తరలిస్తూ.. 62 బంతుల్లో 86 పరుగులు చేసింది. ఇందులో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. సెంచరీకి చేరువవుతున్న సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి రెండు వికెట్లు తీసింది.

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు