ఐపీఎల్ ట్రోఫీ.. అసలు ఛాంపియన్ మలింగ : రోహిత్ కామెంట్

Published : May 13, 2019, 09:59 AM IST
ఐపీఎల్ ట్రోఫీ.. అసలు ఛాంపియన్ మలింగ : రోహిత్ కామెంట్

సారాంశం

ఐపీఎల్ ఉత్కంఠ పోరులో అంతిమ విజయం ముంబయికే దక్కింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. 

ఐపీఎల్ ఉత్కంఠ పోరులో అంతిమ విజయం ముంబయికే దక్కింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన చెన్నై... ఒక్క పరుగు తేడాతో ట్రోఫీని చేజార్చుకుంది.

కాగా... ఈ విజయంపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ హర్ష వ్యక్తం చేశారు. ఈ కప్ అందుకోవడం ముంబయి కి ఇది నాలుగోసారి. ఈ సీజన్ విజయం తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఫైనల్ మ్యాచ్ లో బౌలర్ మలింగ ను రోహిత్ ఛాంపియన్ గా పేర్కొన్నాడు.

‘‘‘ముంబయి విజయం జట్టు అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో సత్తా చాటారు. ఒక ఛాంపియన్‌ బౌలర్‌ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. ఈ మ్యాచ్ ఛాంపియన్ అతనే.  20 ఓవర్‌ హార్దిక్‌ పాండ్యతో వేయిద్దాం అనుకున్నాం. కానీ ఇలాంటి పరిస్థితిల్లో ఎలా బౌలింగ్ చేయాలో మలింగకు బాగా తెలుసు. అందుకే అతనివైపు మొగ్గు చూపిచాను’’ అని రోహిత్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !