ప్రో కబడ్డి 2019: పవన్ విధ్వంసం... హర్యానాపై బెంగళూరు ఘన విజయం

Published : Oct 02, 2019, 10:02 PM ISTUpdated : Oct 02, 2019, 10:44 PM IST
ప్రో కబడ్డి 2019: పవన్ విధ్వంసం... హర్యానాపై బెంగళూరు ఘన విజయం

సారాంశం

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో బెెంగళూరు బుల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పవన్ కుమార్ ఏకంగా 39 పాయింట్లతో చెలరేగి హర్యానాను చిత్తు చేసింది.  

ప్రో కబడ్డి లీగ్ 2019 లో బెంగళూరు బుల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ జట్టు స్టార్ రైడర్ పవన్ కుమార్ ఆకాశమే  హద్దుగా చెలరేగడంతో హర్యానా స్టీలర్స్ పై బుల్స్ 
సునాయాసంగా గెలుపొందింది. అతడొక్కడే రైడింగ్ లో  34 మొత్తంగా 39 పాయింట్లు సాధించాడు. దీంతో 23 పాయింట్ల తేడాతో బెంగళూరు విజేతగా నిలిచింది.  

బెంగళూరు స్టార్ రైడర్ పవన్ కుమార్ 39 పాయింట్లతో చెలరేగాడు. హర్యానా రైడర్స్ అందరూ కలిసి కేవలం 31 పాయింట్లు సాధిస్తే పవన్ ఒక్కడే అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించాడు. దీంతో బెంగళూరు జట్టు రైడింగ్ లో 39, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 8, ఎక్స్‌ట్రాల రూపంలో 2 మొత్తం 59 పాయింట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. 

హర్యానా జట్టు రైడింగ్ లో 31, ట్యాకిల్స్ లో 3, ఆలౌట్ల ద్వారా 2 ఇలా కేవలం 36 పాయింట్లు మాత్రమే సాధించింది. ఆటగాళ్లలో ప్రశాంత్ 17, వికాస్ 6, వినయ్ 5. నవీన్ 3 పాయింట్లు సాధించినా ఫలితంలేకుండాపోయింది. ఈ మ్యాచ్  మొత్తంలో బెంగళూరు ఆసాంతం ఆదిపత్యం ప్రదర్శించింది. 

PREV
click me!

Recommended Stories

Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?