అడ్డంగా దోరికిన ప్రీతి జింతా (వీడియో)

Published : May 21, 2018, 12:43 PM IST
అడ్డంగా దోరికిన ప్రీతి జింతా (వీడియో)

సారాంశం

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ 

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా ముందే సంబరపడ్డారు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్లేవో తెలిసిపోయింది. ఆఖరి బెర్తు కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు పోటీపడిన విషయం తెలిసిందే . ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిందని తెలియగానే ఆమె తెగ ఆనందపడిపోయారు. పక్కనే ఉన్న మరో సహ యజమానితో ఆమె మురిసిపోతూ ‘నిజంగా... నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి ముంబై ఫైనల్‌కు వెళ్లడం లేదు. నేనైతే హ్యాపీ’ అని సంభాషిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. పంజాబ్‌పై చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.

PREV
click me!

Recommended Stories

Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్