నీరజ్ చోప్రాకు మోదీ ప్రశంసలు

Bhavana ThotaPublished : May 17, 2025 11:22 AM

దోహా డైమండ్ లీగ్‌లో 90 మీటర్లు దాటి వ్యక్తిగత రికార్డు సాధించిన నీరజ్ చోప్రాను ప్రధాని మోదీ అభినందించారు. 

ఢిల్లీ: భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్‌లో చరిత్ర సృష్టించాడు. 90.23 మీటర్ల దూరానికి జావెలిన్ విసిరి తన వ్యక్తిగత రికార్డును సృష్టించాడు. ఇది ఆయన కెరీర్‌లో 90 మీటర్ల మార్క్‌ను దాటి సాధించిన మొదటి విజయమైన సంగతి విశేషం. మూడో ప్రయత్నంలో ఈ అద్భుత ఫలితాన్ని నమోదు చేసిన నీరజ్, చివరికి రజత పతకాన్ని గెలుచుకున్నాడు.ఈ పోటీలో నీరజ్ ముందు ప్రయత్నంలో 88.4 మీటర్లకు జావెలిన్ విసిరాడు. మూడో అంచె వద్ద 90.23 మీటర్లకు చేరి తానే పెట్టుకున్న గత రికార్డును తిరగరాశాడు. అయితే, గేమ్ ముగింపు సమయంలో జర్మనీలోని జూలియన్ వెబ్బర్ 91.06 మీటర్ల విసురుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తన విజయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ, నీరజ్ ను అభినందించారు. 90 మీటర్ల మార్క్ దాటి రికార్డు సృష్టించిన నీరజ్‌ను దేశం గర్వంగా చూస్తుందని ఆయన పేర్కొన్నారు.ఇక మరో భారత అథ్లెట్ కిషోర్ జెనా 76.31 మీటర్ల విసురుతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. గత ఏడాది అతను తొమ్మిదో స్థానంలో ఉండగా, ఈసారి మరో మెట్టు ఎక్కాడు.

ఈ విజయంతో నీరజ్ మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌గా ఇప్పటికే భారత క్రీడా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు 90 మీటర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి కొత్త మైలురాయిని నెలకొల్పాడు.

 

Read more Articles on
click me!