ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ.. ప్రభుత్వంతో ఒప్పందం

Published : Nov 17, 2018, 04:40 PM IST
ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ.. ప్రభుత్వంతో ఒప్పందం

సారాంశం

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏపీలో క్రికెట్ అకాడమీ  ఏర్పాటు చేయనున్నారు

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏపీలో క్రికెట్ అకాడమీ  ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఆయన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సుమారు రూ.60కోట్ల వ్యయంతో విశాఖలో ఈ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.

శనివారం ధోనీ కి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఫ్రైవేట్ లిమిటె్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్.. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఈ ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు, ఇంటర్నేషనల్ స్కూల్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఈ అకాడమీని క్రికెట్ కే పరిమితం చేయకుండా.. ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?