టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏపీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు
టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏపీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఆయన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సుమారు రూ.60కోట్ల వ్యయంతో విశాఖలో ఈ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.
శనివారం ధోనీ కి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఫ్రైవేట్ లిమిటె్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్.. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు, ఇంటర్నేషనల్ స్కూల్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఈ అకాడమీని క్రికెట్ కే పరిమితం చేయకుండా.. ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.