
ధోనీ పేరు వింటేనే అభిమానుల్లో ఎక్కడా లేని జోష్ పుడుతుంది.. ఇప్పటి వరకూ ఏ భారత జట్టు సారథికి సాధ్యం కాని విధంగా రెండు ప్రపంచకప్లు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత కేవలం ధోనీకి మాత్రమే దక్కింది. అయితే ముందుగా చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వన్డౌన్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా ఔట్ అయిన అనంతరం ధోనీ బ్యాటింగ్కు వెళ్తున్నాడు. ఆ క్రమంలో సీఎస్కే అభిమాని అక్కడి సిబ్బందిని సైతం నెట్టుకొని వచ్చి మరీ ధోనీ పాదాలపై పడ్డాడు. అంతటితో ఆగకుండా ఉద్వేగంతో ధోనీని హత్తుకొని ఆనందంతో పొంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.