చెత్తరికార్డు ఇప్పటి వరకు రవీంద్ర జడేజాపై ఉంది. తాజాగా షమీ ఆ రికార్డును అధిగమించాడు. 2014లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో జడేజా 80 పరుగులు సమర్పించుకున్నాడు.
గౌహతి: వెస్టిండీస్ పై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో భారత బౌలరు మొహమ్మద్ షమీ చెత్త రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్ పై అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలరుగా రికార్డుల్లోకి ఎక్కాడు. వెస్టిండీస్ పై జరుగుతున్న ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన షమీ 81 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఈ చెత్తరికార్డు ఇప్పటి వరకు రవీంద్ర జడేజాపై ఉంది. తాజాగా షమీ ఆ రికార్డును అధిగమించాడు. 2014లో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో జడేజా 80 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో జడేజా తరువాత అమర్ నాథ్(79), శ్రీశాంత్(79), రవిశాస్త్రి (77)లున్నారు.
అమర్ నాథ్, రవిశాస్త్రిలు 1983లో జంషెడ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పారు. శ్రీశాంత్ 2007లో నాగ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఈ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఆదివారంనాటి ఈ మ్యాచ్ షమీ దారుణంగా పరుగులివ్వడంతో పాటు హెట్మెయిర్ సెంచరీతో చెలరేగడంతో భారత్కు విండీస్ 323 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
కాగా భారత్పై విండీస్కు ఇది నాలుగో భారీ స్కోర్ కావడం విశేషం. 1983 జంషెడ్పూర్ వన్డేలో 333/8 భారీ స్కోర్ నమోదు చేసిన విండీస్.. 2002 అహ్మదాబాద్ వన్డేలో 324/4, 2007 నాగ్పూర్ వన్డేలో 324/8 పరుగులు చేసింది.