వాలీబాల్ క్రీడాకారిణీపై రెండున్నరేళ్లుగా కోచ్ అత్యాచారం.. మ్యాచ్‌ల మధ్యలోనే అఘాయిత్యం

Published : Jul 25, 2018, 03:39 PM IST
వాలీబాల్ క్రీడాకారిణీపై రెండున్నరేళ్లుగా కోచ్ అత్యాచారం.. మ్యాచ్‌ల మధ్యలోనే అఘాయిత్యం

సారాంశం

తనపై కోచ్ రెండున్నరేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వాలీబాల్ క్రీడాకారిణీ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

తనపై కోచ్ రెండున్నరేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వాలీబాల్ క్రీడాకారిణీ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. హర్యానాలోని రివారీ గ్రామానికి చెందిన ఓ బాలిక వాలీబాల్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తుంది. ఆమెపై కన్నేసిన  కోచ్ గౌరవ్ దేశ్వాల్ బాలికను లొంగదీసుకుని గత రెండున్నరేళ్ల  నుంచి అత్యాచారం చేస్తున్నాడు... ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో పాటు.. తన భవిష్యత్తు దృష్ట్యా బాలిక మౌనంగా అతని వేధింపులు భరించింది.

అయితే ఓపిక నశించిన క్రీడాకారిణీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్గావ్, రోహతక్‌తో పాటు పలు ప్రాంతాలకు తనను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గౌరవ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు. దీనిపై వివరణ కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత కోచ్‌ను అరెస్ట్ చేస్తామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Pakistan : ఘోర అవమానం.. హోటల్ బిల్లులు కట్టలేక గిన్నెలు కడిగిన పాకిస్థాన్ ఆటగాళ్లు