ఆసియా పారా గేమ్స్ 2023 : జావెలిన్ లో సుమిత్ యాంటిల్ కి స్వర్ణం.. కొత్త ప్రపంచ, పారా ఆసియా క్రీడల రికార్డు...

Published : Oct 25, 2023, 09:00 AM ISTUpdated : Oct 25, 2023, 09:13 AM IST
ఆసియా పారా గేమ్స్ 2023 : జావెలిన్ లో సుమిత్ యాంటిల్ కి స్వర్ణం..  కొత్త ప్రపంచ, పారా ఆసియా క్రీడల రికార్డు...

సారాంశం

పురుషుల జావెలిన్ ఎఫ్64 ఈవెంట్‌లో పారా అథ్లెట్ సుమిత్ యాంటిల్ భారత్ తరఫున స్వర్ణం సాధించాడు.

హాంగ్‌జౌ : భారత పారా అథ్లెట్ సుమిత్ యాంటిల్ హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ 2023లో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు. బుధవారం 25 అక్టోబర్ 2023 నాడు ఈ ఘనత సాధించాడు సుమిత్. 

సుమిత్ 73.29 మీటర్లు విసిరి కొత్త ప్రపంచ, పారా ఏషియన్, గేమ్స్ రికార్డులను నెలకొల్పి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఈ తరువాతి స్థానంలో పుష్పేంద్ర సింగ్ నిలిచాడు. అతను జావెలిన్ ను 62.06 మీటర్లు బలంగా విసిరి కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా, పారా ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తుంది. పోటీల తొలి రోజు సోమవారం 6 స్వర్ణాలతో పాటు 17 పతకాలతో శుభారంభం చేసింది భారత్. రెండో రోజు మంగళవారం మూడు పసిడి సహా 17 పతకాలు భారత్ తన ఖాతాలో వేసుకుంది.ఇప్పటివరకు 9 స్వర్ణాలతో సహా మొత్తం 34 పథకాలు భారత్ సొంతం చేసుకుంది.  

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కూడా ఈ ఆటల్లో తమ సత్తా చాటుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆటగాడు రవి రొంగలి  షాట్ పుట్ లో  రజతం సాధించాడు. ఎఫ్ 40  కేటగిరీలో రవి  గుండును 9.92 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణ అట్లేట్ జీవాంజి దీప్తి పారా ఆసియా క్రీడల్లో అదరగొట్టింది.  మహిళల టీ20 400 మీటర్ల పరుగులో ఆసియా క్రీడలు, పారా ఆసియా క్రీడల  రికార్డును బద్దలు కొట్టింది. 56.69 సెకండ్లలో నిర్ణీత పరుగును పూర్తి చేసి స్వర్ణ పథకం కైవసం చేసుకుంది దీప్తి. .ఈ పోటీ మంగళవారం జరిగింది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?
Unbreakable Cricket Records: 27 సిక్సర్లు, 30 ఫోర్లు.. ఒకే టీ20 ఇన్నింగ్స్ లో 344 రన్స్.. వరల్డ్ రికార్డ్ షేక్!