మోక్షదా ఏకాదశి వ్రతం

Published : Dec 14, 2021, 11:32 AM IST
మోక్షదా ఏకాదశి వ్రతం

సారాంశం

విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి , షోడశోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి  విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి. 


                విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః 
                భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః 

మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు , అవసరాలు వుంటాయి గనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్ధించడం జరుగుతుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్ధం మోక్షాన్ని కోరడమే అవుతుంది. మోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమౌతుంది. 
పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం మరలా జన్మించడం , మళ్లీ మళ్లీ కష్టాలు బాధలు అనుభవిస్తూ వుండటం జరుగుతూ వుంటాయి. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్టయితే అన్నిరకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ వుంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా 'మోక్షదా ఏకాదశి' కనిపిస్తూ వుంటుంది.

'మార్గశిర ఏకాదశి' నే మోక్షదా ఏకాదశి గా పిలుస్తుంటారు. ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్లు , ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటినీ , పూజా మందిరాన్ని పరిశుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి. 

విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి , షోడశోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి  విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే పునఃపూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది. పూర్వం ఈ వ్రతాన్ని వైఖాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

మోక్షాద ఏకాదశి సమయంలో ఆచారాలు:- మోక్షాద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు  స్నానం చేయాలి. ఈ రోజు ఉపవాసం ముఖ్యమైనది. మోక్షద ఏకాదశి ఉపవాసం ఏదైనా తినకుండా , తాగకుండా రోజు గడపడం. ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి  తిథి సూర్యోదయం వరకు 24 గంటల పాటు ఉపవాసం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తున్న వ్యక్తి మరణం తరువాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం.

కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాలు , పాల ఉత్పత్తులు , పండ్లు మరియు ఇతర శాఖాహార ఆహారాలు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది. మోక్షదా ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి కూడా బియ్యం , ధాన్యాలు , పప్పుధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం నిషేదం.

విష్ణువును తన దైవిక ఆశీర్వాదం కోసం భక్తితో పూజిస్తాడు. ఈ రోజున పవిత్ర భగవద్గీతను కూడా పూజిస్తారు మరియు అనేక దేవాలయాలలో ఉపన్యాసాలు చదవబడతాయి. ఈ వ్రతం చేసేవారు  పూజ యొక్క అన్ని ఆచారాలను అనుసరించి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు. మోక్షాద ఏకాదశి సందర్భంగా 'భగవద్గీత', 'విష్ణు సహస్రనామం', 'ముకుందష్టకం' చదవడం శుభంగా భావిస్తారు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

                

PREV
click me!

Recommended Stories

IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?