Sankranthi 2022: గంగానదిలో పవిత్ర స్నానాలు రద్దు..!

Published : Jan 11, 2022, 12:34 PM ISTUpdated : Jan 11, 2022, 12:40 PM IST
Sankranthi 2022: గంగానదిలో పవిత్ర స్నానాలు రద్దు..!

సారాంశం

హర్ కీ పౌరీ ప్రాంతంలో  ప్రవేశాన్ని కూడా నిషేధించారు. ఆ ప్రాంతాల్లో.. రాత్రి కర్ఫ్యూ కూడా విధించడం గమనార్హం. రాత్రి 10 గంటల నుండి జనవరి 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఒమిక్రాన్ వేరియంట్.. వేంగా దూసుకువస్తోంది. ముఖ్యంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్.. ఉత్తరాఖండ్  లో విజృంభిస్తోంది. దీంతో.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. మకర సంక్రాంతికి హరిద్వార్ లో కఠినమైన ఆంక్షలను అమలు చేసింది.

జనవరి 14న వచ్చే మకర సంక్రాంతి రోజున భక్తులు పుణ్య స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే.. ఈ సారి కరోనా కేసుల కారణంగా.. గంగా నది పవిత్ర స్నానాలు చేయడాన్ని నిషేధించారు. హర్ కీ పౌరీ ప్రాంతంలో  ప్రవేశాన్ని కూడా నిషేధించారు. ఆ ప్రాంతాల్లో.. రాత్రి కర్ఫ్యూ కూడా విధించడం గమనార్హం. రాత్రి 10 గంటల నుండి జనవరి 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా... కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  డేటా ప్రకారం, భారతదేశం 1,68,063 కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లను నమోదు చేసింది, మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,58,75,790కి చేరుకుంది, ఇందులో ఓమిక్రాన్ వేరియంట్  కేసులు 4,461 నమోదు కావడం గమనార్హం.

క్రియాశీల కేసులు 8,21,446కి పెరిగాయి, ఇది 208 రోజులలో అత్యధికం, మరణాల సంఖ్య 277. ఈ తాజా మరణాలతో 4,84,213కి చేరుకుంది.

ఇదిలా ఉండగా, కర్ణాటకలో కూడా సంక్రాంతికి ఎలాంటి సడలింపులు ఉండవు. కర్ణాటకలో కోవిడ్-19 కేసుల పెరుగుదలను ఉటంకిస్తూ, తక్కువ సానుకూలత రేటు ఉన్న ప్రదేశాలలో పరిమితులను సడలించడాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం తోసిపుచ్చారు. బదులుగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!
Chanakya Niti: జీవితంలో ఈ ముగ్గురు ఉంటే... మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు..!