ఏడవ రోజు దుర్గాదేవికి అవతారం 'కదంబం' ప్రసాదం

Published : Oct 13, 2021, 10:40 AM IST
ఏడవ రోజు దుర్గాదేవికి అవతారం  'కదంబం' ప్రసాదం

సారాంశం

శరన్నవరాత్రులలో ఏడవ రోజు దుర్గాదేవి అవతారాన్ని కొలుస్తారు. అమ్మవారికి 'కదంబం' ప్రసాదం నివేధన చేస్తారు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


శరన్నవరాత్రులలో ఏడవ రోజు దుర్గాదేవి అవతారాన్ని కొలుస్తారు. అమ్మవారికి 'కదంబం' ప్రసాదం నివేధన చేస్తారు. 

కదంబం తయారు చేయడానికి కావలసినవి పదార్ధాలు :- 

కందిపప్పు 1/2 కప్పు 

బియ్యం 1/2 కప్పు ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )

1 వంకాయ

1/4 సొరకాయ

1 దోసకాయ

బీన్స్ తగినన్ని

1 ఆలు 

పల్లీలు 2 పిడికిళ్ళు

2 మొక్కజొన్నలు

1/2 క్యారెట్

2 టోమాటో

తగినంత కర్వేపాకు

కొత్తిమీర

కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప

4 పచ్చిమిర్చి

నూనె తగినంత

నెయ్యి చిన్న కప్పు

చింతపండు గుజ్జు తగినంత

కాస్త బెల్లం 

ఉప్పు , పసుపు తగినంత

3 చెంచాలు సాంబర్ పౌడర్

పోపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ .

చేయవలసిన విధానము :-  ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని ఉంచుకోండి కుక్కర్లో కందిపప్పు, బియ్యం, పల్లీలు, టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి పసుపు, ఉప్పు, నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక స్టవ్ ఆపేయండి. 

మూకుడులో కొద్దిగ నూనె వేడి చేసాక అందులో కొద్దిగా ఆవాలు వేసి అవి చిట్లిన తర్వాత పచ్చిమిర్చి, కర్వేపాకు, టొమాటో, చింతపండు గుజ్జు , సాంబర్ పౌడర్ , బెల్లం వేసి బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవి అంతా ఉడికిన బియ్యంలో వేసి కొత్తిమీర, కర్వేపాకు, నెయ్యివేసి మరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తర్వాత ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందండి. 

PREV
click me!

Recommended Stories

Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!