రూ.699కే షియోమి నుంచి కొత్త డివైస్

First Published Mar 21, 2018, 10:36 AM IST
Highlights
  • భారత్ లో మార్కెట్ ని విస్తరించుకుంటున్నషియోమి

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత్ లో తన మార్కెట్ ని పొడిగిస్తోంది. మొన్నటి వరకు కేవలం స్మార్ట్ ఫోన్లను మాత్రమే భారత మార్కెట్లోకి తీసుకువచ్చిన షియోమి.. ఇటీవలే బడ్జెట్ ధరలో టీవీలను కూడా తీసుకువచ్చింది. కాగా.. తాజాగా ఇయర్ ఫోన్స్ ని కూడా మార్కెట్లోకి తీసుకువచ్చింది. షియోమీ ఎంఐ ఇయర్‌ఫోన్స్, ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్ పేరిట రెండు కొత్త ఇయర్‌ఫోన్ మోడల్స్‌ను ఇవాళ విడుదల చేసింది.

ఎంఐ ఇయర్‌ఫోన్స్ బ్లాక్, సిల్వర్ రంగుల్లో రూ.699 ధరకు లభిస్తుండగా, ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్ ఇయర్‌ఫోన్లు రూ.399 ధరకు లభిస్తున్నాయి. వీటిని ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో యూజర్లు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ 5, రెడ్‌మీ నోట్ 5 ఫోన్లతో ఈ ఇయర్‌ఫోన్స్‌ను కలిపి కొంటే రూ.100 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఇయర్‌ఫోన్ మోడల్స్ రెండింటిలోనూ యూజర్లకు పవర్‌ఫుల్ బేస్‌తో కూడిన సౌండ్ వస్తుంది. అత్యంత నాణ్యమైన సౌండ్ అవుట్‌పుట్ వీటిలో లభిస్తుంది. డైనమిక్ బేస్ అనే ఫీచర్‌ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతో ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ రెండు ఇయర్‌ఫోన్లలోనూ బిల్టిన్ మైక్రోఫోన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే వాయిస్ కాల్స్ ఆన్సర్, కట్ చేయడానికి, సాంగ్స్ వినేటప్పుడు ప్లే, పాజ్‌కు ప్రత్యేకంగా బటన్లను ఇచ్చారు.

click me!