వొడాఫోన్ అమేజింగ్ ఆఫర్

Published : Dec 11, 2017, 02:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
వొడాఫోన్ అమేజింగ్ ఆఫర్

సారాంశం

మధ్యప్రదేశ్, ఛతీస్ ఘడ్ రాష్ట్రాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వొడాఫోన్ ఈ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్.. అమేజింగ్ ఆఫర్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఛతీస్ ఘడ్ రాష్ట్రాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వొడాఫోన్ ఈ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ.176 తో రీఛార్జ్ చేసుకుంటే.. ప్రతి రోజూ ఒక జీబీ డేటాని పొందవచ్చు. అంతేకాకుండా రోమింగ్ లో కూడా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

మధ్యప్రదేశ్, ఛతీస్ ఘడ్ రాష్ట్రాల ప్రజలు.. ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఎక్కువ శాతం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల వినియోగదారులను మరింత ఆకట్టునేందుకు వొడాఫోన్ ఈ చర్యలు చేపట్టింది. ఈ ఆఫర్ ని కనుక  మై వొడాఫోన్ యాప్ నుంచి కనుక వినియోగించుకుంటే.. ఆ సదరు వినియోగదారునికి 5శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. రోజుకి 250 నిమిషాల నొప్పున వారానికి వెయ్యి నిమిషాల కాల్స్  ఉచితంగా చేసుకోవచ్చు. లిమిటెడ్ ఆఫర్ దాటితే నిమిషానికి 30పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu