తండ్రి కళ్లముందే కూతురిపై అత్యాచారయత్నం చేసిన దుండగుడు

Published : Apr 04, 2018, 05:10 PM IST
తండ్రి కళ్లముందే కూతురిపై అత్యాచారయత్నం చేసిన దుండగుడు

సారాంశం

కుమురం భీం జిల్లాలో దారుణం

గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కుమురం భీం జిల్లాలోని తిర్యాని మండలంలో చోటుచేసుకుంది. బాలిక తండ్రిపై దాడి చేసి అతడి ఎదురుగానే దుండగుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.  

కుమరం భీం జిల్లాలోని జెండాగూడ గ్రామానికి చెందిన ఓ గిరిజన బాలిక తండ్రితో కలిసి పశువులు మేపడానికి అడవికి వెళ్లింది. అయితే ఈ బాలికపై కన్నేసిన ఓ గుర్తుతెలియని దుండగుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక తండ్రి అతడిని అడ్డుకోవడంతో అతడిపై దుండగుడు కర్రతో దాడి చేశాడు. దీంతో తండ్రి  స్పృహా కోల్పోయాడు. కొద్ది క్షణాల్లోనే మళ్లీ స్పృహాలోకి రాగా ఆ దుండగుడు అమ్మాయి అరవకుండా నోట్లో గుడ్డలుకుక్కి బలవంతంగా లాక్కెలుతుండడాన్ని చూశాడు. దీంతో  ఆ దుండగుడిపై కర్రతో దాడి చేసి కూతురిని కాపాడాడు. ఈ దాడిలో గాయపడిన కామాంధుడు యువతిని వదిలేసి పారిపోయాడు.  
 
ఈ ఘటనపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిర్యాణి ఎస్సై రాజమౌళిగౌడ్‌ తెలిపారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడి కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu