తిరుమల భక్తుల మీద జిఎస్ టి దెబ్బ, కాటేజీ అద్దె పెంపు

Published : Jul 10, 2017, 08:33 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
తిరుమల భక్తుల మీద జిఎస్ టి దెబ్బ, కాటేజీ అద్దె పెంపు

సారాంశం

తిరుమల  శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు పన్ను పోటు మొదలయింది. అద్దె గదులకు జిఎస్ టి  వర్తిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రూ.1000 నుంచి రూ.2వేల అద్దె గదులపై 12శాతం, రూ.2,500 నుంచి రూ.6వేల అద్దె గదులపై 18శాతం జిఎస్ టి ఉంటుందని టీటీడీ తెలిపింది. రూ.వెయ్యి లోపు అద్దె గదులకు జిఎస్ టి నుంచి మినహాయింపు  ఉంటుంది.

తిరుమల  శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు పన్ను పోటు మొదలయింది. అద్దె గదులకు జిఎస్ టి  వర్తిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.  అద్దె ను బట్టి గదులపై 12శాతం, 18శాతం జిఎస్ టి ఉంటుంది. వెయ్యి రుపాయల  లోపు అద్దె  ఉండే గదులకు జిఎస్ టి నుంచి మినహాయింపు  ఉంటుంది.

 

 

రు.1000- రు.2000 అద్దె ఉన్న కాటేజీలకు 12 శాతం జిఎస్ టి విధిస్తారు. అపుడు  అద్దె  ఇలా పెగుగుతుంది.

 

రు. 1500 నుంచి రు.1700లకు  పెరుగుతుంది.

రు.2000ల నుంచి  రు. 2200లకు పెరుగుతుంది.

 

రు. 2500 , ఆ పై న అద్దె ఉన్న కాటేజీలకు 18 శాతం జిఎస్ టి ఉంటుంది. అద్దె ఇలా మారుతుంది.

 

రు. 2500 నుంచి  రు.3000 లకు పెరుగుతంది

రు.3000. నుంచి రు 3500 లకు పెరుగుతంది.

రు. 4000  నుంచి  రు.4700 లకు పెరుగుతుంది.

రు. 4500 నుంచి రు.5300 లకు పెరుగుతుంది.

రు. 6000 లనుంచి రు.7100 లకు పెరుగుతంది.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu