తిరుపతి- జమ్ము హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రేపు మొదలు

Published : Jun 14, 2017, 12:58 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
తిరుపతి- జమ్ము హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రేపు మొదలు

సారాంశం

ఢిల్లీ వెళ్లేందుకు పూర్తి ఏసీ బోగీలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌ రైలు రాయలసీమ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. తిరుపతి–జమ్ముతావి మధ్య హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడవనున్న ఈ రైలును రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు.

తెలుగు వాళ్లు దేశ రాజధాని న్యూ ఢిల్లీ వెళ్లేందుకు పూర్తి ఏసీ బోగీలతో కూడిన ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి–జమ్ముతావి మధ్య హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడవనున్న ఈ రైలును రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు గురువారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌(22705) ప్రతి మంగళవారం సాయంత్రం 5.10కి తిరుపతి నుంచి బయల్దేరి గురువారం రాత్రి 9.10కి జమ్ముతావి చేరుకుంటుంది.

ఈ రైలు(22706) తిరిగి జమ్ముతావి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 5.30కు బయల్దేరి ఆదివారం ఉదయం 11.20కి తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోనీ, మంత్రాలయం రోడ్డు, రాయచూర్‌ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఖాజీపేట, రామగుండం, నాగపూర్, ఢిల్లీ, అంబాలా, లూథియానా, మీదుగా జమ్ముతావి వెళుతుంది. 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu